
జిన్నారం, వెలుగు: మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలో పోలీసులు బైక్దొంగల ముఠాను పట్టుకున్నారు. సీఐ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 26న వాహన తనిఖీలో భాగంగా గడ్డ పోతారం కృష్ణయ్య పల్లి రహదారిపై ఓ ఆటోలో గుండ్ల పోచంపల్లికి చెందిన షేక్ ఫక్రుద్దీన్, దుండిగల్ కు చెందిన మీనంపల్లి జగన్, మేడ్చల్ జిల్లా దుండిగల్ కు చెందిన బౌరంపేట రాకేశ్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.
వారిని పట్టుకుని ఆటోను, ముగ్గురిని బొల్లారం పీఎస్తరలించి విచారించగా 20 రోజుల నుంచి మెదక్ జిల్లా నర్సాపూర్, మేడ్చల్ జిల్లా దుండిగల్, సూరారం, సంగారెడ్డి జిల్లా బొల్లారం, గడ్డ పోతారం నుంచి 9 బైకులను దొంగలించినట్లు ఒప్పుకున్నారు. అందులో కొన్ని బైకులను మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తికి విక్రయించామని, మిగితా బైకులను తమ వద్దే ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆటోను సీజ్ చేసి ముగ్గురు దొంగలు, బైకులను కొన్న వ్యక్తిని రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు.